సూపర్ స్టార్ మహేశ్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేసిన రెండో సినిమా భరత్ అను నేను.మహేశ్ కెరీర్లో అతి పెద్ద విజయంగా ఈ సినిమా నిలిచింది.మహేశ్ను 200 కోట్ల క్లబ్లో చేర్చిన సినిమా కూడా ఇదే.ఈ సినిమాను దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే.అయితే గత రెండు రోజులుగా దానయ్య కొరటాల శివతో పాటు హీరోయిన్ కైరా అద్వానీలకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదనే వార్త గట్టిగా వినబడుతుంది.ఈ వార్తలను దానయ్య కూడా ఖండించారు.
సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి పూర్తి రెమ్యునరేషన్ చెల్లించేశామని ఆయన తెలిపారు.తాజాగా ఈ వార్తలపై స్పందించారు చిత్ర దర్శకుడు కొరటాల.సినిమా విడుదలకు ముందే తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం వచ్చిందని తెలిపారు. డీవీవీ దానయ్య గొప్ప వ్యక్తి అని, రామానాయుడు తర్వాత అంత మనసున్న నిర్మాతల్లో ఆయనొకరని చెప్పారు.ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపాడు కొరటాల.