ఏ ముహూర్తాన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా చేయాలనుకున్నాడో కానీ బాలయ్యకు అన్నీ అవమానాలే ఎదురవుతున్నాయి. ఇక తెరవెనుక నారా చంద్రబాబు, నారా లోకేష్లు కోరుకున్నట్టుగా ఎన్టీఆర్ జీవిత కథలో బాలయ్య మార్పులు చేర్పులు చేయిస్తూ ఉండడంతో నందమూరి కుటుంబ సభ్యులకు కూడా బాలయ్య తీరు అస్సలు నచ్చడం లేదు. ఇక యువ ఎన్టీఆర్గా తారక్ని చూపించాలని తేజ అనుకున్నాడు. అయితే బాలయ్య మాత్రం యువకుడిగా ఉన్న ఎన్టీఆర్ పాత్ర గెటప్లో కూడా తానే కనిపిస్తానని కోరడంతో తేజ మొత్తంగా ప్రాజెక్ట్ నుంచే తప్పుకున్నాడు.
ఇక ఇప్పుడు మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తున్న నాగ్ అశ్విన్ కూడా పరోక్షంగా బాలయ్యను తప్పు పట్టాడు. మహానటి సావిత్రి జీవిత కథకు నాగ్ అశ్విన్ న్యాయం చేశాడు అన్న ప్రశంశలు సినిమా రిలీజ్కి ముందునుంచే వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ జీవిత కథ విషయంలో మాత్రం అన్నీ విమర్శలే వినిపిస్తున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ కూడా ఆ మహానటుడు ఎన్టీఆర్ పాత్ర పోషించాలంటే ఒక్క తారక్కి మాత్రమే సాధ్యమని చెప్పుకొచ్చాడు. ఇంకెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరని……అందుకే మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం కూడా ఎన్టీఆర్ని ఒక్కడినే అడిగామని……..అయితే ఎన్టీఆర్ మాత్రం తాతయ్య పాత్రలో……..ఆ మహానటుడి స్థాయిలో నేను నటించలేనని సున్నితంగా చెప్పి సారీ చెప్పాడని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఎన్టీఆర్ని అడిగిన తర్వాత బాలయ్యను, నానీని అడిగినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నాగ్ అశ్విన్ మాత్రం అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశాడు. ఆ మహానటుడి ఎన్టీఆర్ పాత్రకు తారక్ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని……అందుకే తారక్ ఒక్కడినే అడిగామని ……..తారక్ నో చెప్పడంతో టెక్నాలజీపైన ఆధారపడి గ్రాఫిక్స్తో మేనేజ్ చేశామని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ లాంటి సూపర్ సెన్సిబుల్ డైరెక్టర్ చెప్పిన తర్వాత అయినా మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ సినిమాకు బాలయ్య అన్యాయం చేయకుండా…………వెటకారం అయిపోకుండా జాగ్రత్తపడతాడేమో చూడాలి. లేకపోతే 2019 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, లోకేష్లు చెప్పినట్టు ఆడుతూ మరోసారి స్వర్గీయ ఎన్టీఆర్కి అన్యాయం చేస్తాడేమో చూడాలి. వెన్నుపోటు సమయంలో కూడా కన్నతండ్రి, మహానటుడు అయిన ఎన్టీఆర్ని వదిలేసి బాబు చూపించిన ప్రలోభాలకు ఆశపడి చంద్రబాబుకు మద్దతిచ్చిన ఘనుడు మన గ్రేట్ బాలయ్య మరి.