వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను తాను నాస్తికుడిని అని చెప్పుకుంటారు. అంతే కాదు గతంలో పలు సందర్భాల్లో దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. చివరకు నాస్తికుడైన వర్మ కూడా తన జీవితంలో ఎవరూ ఊహించని పని చేసి వార్తల్లో కెక్కారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాణం కోసం గురువారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన.. అనంతరం తిరుమల చేరుకున్నా అయన ఉదయం విఐపి విరామ సమయంలో స్వామిని దర్శనం చేసుకుని భక్తుడిగా మారారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వర్మకు వినాయకుడి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. సాధారణ భక్తుల తరహాలోనే వర్మ దైవదర్శనం చేసుకున్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాణంలో భాగంగా తిరుమలకు వచ్చానని చెప్పారు. 1993 ‘గోవిందా గోవిందా’ అనే సినిమా సమయంలో తిరుమలకు వచ్చానని, ఆ తర్వాత తిరుమలకు రావడం ఇదేనని తెలిపారు. తనకు దేవుడంటే నమ్మకమని, నమ్మకం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తానని వర్మ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే భక్తుడు అంటే తనకు నమ్మకం లేదని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతి శిల్పారామంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తానన్నారు. ప్రస్తుత వర్మ తీరు చూస్తుంటే నిజంగానే నాస్తికత్వం వదిలి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నాడా అనేది చర్చనీయాంశమైంది.