Saturday, May 4, 2024
- Advertisement -

ఆ నలుగురి కోసమైనా ‘సాహో’ హిట్ అవ్వాలట

- Advertisement -

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సాహో’ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్న దర్శకుడు సుజిత్ ఈ సినిమా నలుగురి కోసం అయినా ఈ సినిమా హిట్ అవ్వాలని చెబుతున్నాడు. మొదటిది ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్ చేసిన హార్డ్ వర్క్ కోసమైనా ఈ సినిమా హిట్ అవ్వాలని అన్నారు. “సినిమా మొదలయ్యాక చాలామంది తనకు అనుభవం లేదని నిర్మాతలకి సినిమా సలహా ఇచ్చారు కానీ వాళ్లు మాత్రం నా మీద నమ్మకం ఉంచారు కాబట్టి నిర్మాతల కోసం కూడా సినిమా హిట్ అవ్వాలి” అని పేర్కొన్నారు.

“సినిమా హిట్ అవ్వాలని మా అమ్మగారు రోజు ప్రార్థిస్తున్నారు. కాబట్టి మూడవ వ్యక్తి ఆమే. చాలామంది నన్ను రాజమౌళి గారితో పోస్తున్నప్పుడు ఎందుకు నేనేమీ మాట్లాడను అని అడుగుతారు కానీ నాకంటే నా సినిమా ఎక్కువ మాట్లాడాలని నా ఆశ. ఎవరు ఎలా పోల్చినా నేను మాత్రం ఎప్పుడూ రాజమౌళి గారితో పోల్చుకో లేదు” అని చెప్పుకొచ్చాడు సుజిత్. ఇక హాలీవుడ్ రేంజ్ లో తాను ఈ సినిమాను తీశానని, ఇప్పటిదాకా అది చాలా హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలలో టెక్నీషియన్లు పేర్లు బెంగుళూరు చెన్నై కి సంబంధించిన వాళ్ళవి ఉండేదని కానీ మన భారతీయులు కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఎవెంజర్స్ వంటి హాలీవుడ్ సినిమాలు తీయచ్చని కాకపోతే దానికి కావాల్సింది దర్శకుల విజన్ ని నమ్మే నిర్మాతలు మాత్రమే” అని అన్న సుజిత్ ప్రభాస్ తో పాటు కష్టపడి నందుకు తన కోసం కూడా సినిమా హిట్ అవ్వాలని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -