Tuesday, May 21, 2024
- Advertisement -

ఎవ‌రూ పుకార్లు న‌మ్మొద్దు.. మేమే త్వ‌ర‌లో చెప్తాం

- Advertisement -

త్వ‌ర‌లో మీడియా ముందుకు సైరా యూనిట్‌

మెగాస్టార్ చిరంజీవికి అతి పెద్ద విజ‌యం అందించి తండ్రికి కానుక‌గా ఇవ్వాల‌నుకుంటున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. అదులో భాగంగానే ప్రతిష్టాత్మకంగా `సైరా` సినిమా తీస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు భారతీయ భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని ఆలోచిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. మొత్తం నెగిటివ్ టాకే వ‌స్తోంది. ద‌ర్శ‌కుడు మారాడాని, మ్యూజిక్ డైరెక్ట‌ర్ రిజెక్ట్ చేశాడ‌ని, అనుకున్న న‌టీన‌టులు సినిమా చేయ‌డం లేద‌ని ఇలా ఏవేవో పుకార్లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో ఈ పుకార్లు వైర‌ల్‌గా ఉన్నాయి. అయితే ఈ పుకార్ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టే యోచ‌న‌లో చిత్ర‌బృందం ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన నాటి నుంచి ఎవ‌రూ మీడియా ముందుకు రాలేదు. అయితే ఈ పుకార్ల‌పై స‌మాధానం ఇచ్చేందుకు చిత్ర‌బృందం మీడియా ముందుకు త్వ‌ర‌లో వ‌స్తుందంట‌. గాసిప్స్‌పై ఓ క్లారిటీ ఇచ్చేసి సినిమాను పూర్తి చేసే ప‌నిలో ప‌డ‌తారంట‌.

ఈ పుకార్ల‌తో అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అవుతుండ‌డంతో వెంట‌నే చిత్రబృందం రంగంలోకి దిగ‌నుంది. త్వరలో ఈ సినిమాకు సంబందించిన ఫుల్ క్లారిటీని దర్శకుడు సురేందర్‌రెడ్డి, చిరు త‌న‌యుడు, నిర్మాత రామ్‌చరణ్ ఇస్తార‌ట‌. ఈ సినిమా గ‌తేడాది మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఇంత ఖ‌ర్చు చేసి తీస్తున్న సినిమాకు పుకార్లు మ‌చ్చ తెచ్చేలా ఉండ‌డంతో సినిమా బృందం స్పందించ‌డానికి సిద్ధ‌మైంది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానుంది.

https://www.youtube.com/watch?v=tF97zo6rYBI

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -