Sunday, May 12, 2024
- Advertisement -

దొరసాని ట్రయిలర్ టాక్

- Advertisement -

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ చేతులు మీదుగా దొరసాని సినిమా ట్రైలర్ నేడు విడుదల అయింది. ఇప్పటికే సినెమా టీజర్ సినిమా మీద మంచి అంచనాలు క్రియేట్ చేయగా ఇప్పుడు ట్రైలర్ వాటిని రెట్టింపు చేసింది. తెలంగాణ ప్రాంతం లో ఒకప్పుడు జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారం గా ఈ ప్రేమ కథ ని తీశారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా లో హీరో గా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ గా జీవిత-రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక తెరంగేట్రం చేస్తున్నారు. దర్శకుడి కి కూడా ఇది తోలి సినిమా అయినా కానీ ట్రైలర్ ని మాత్రం బాగా కట్ చేయించారు. మంచి విజువల్స్, బ్రహ్మాండమైన సంగీతం తో ట్రైలర్ లో చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా చెప్పారు. కాకపోతే సినిమా ఏ మేరకు మెప్పిస్తుంది, నటీ నటులు ఇద్దరికీ ఎంత వరకు నైపుణ్యం ఉంది అనేది మాత్రం సినిమా విడుదల అయితే కానీ తెలియదు.

ఈ సినిమా ని మధుర శ్రీధర్ రెడ్డి మరియు యష్ రంగినేని ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -