Tuesday, April 30, 2024
- Advertisement -

తమిళ ప్రేక్షకులను పలకరించబోతున్న ఎన్టీఆర్ హీరోయిన్

- Advertisement -

తెలుగు అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ లో ఈషా రెబ్బ కి పెద్దగా మంచి అవకాశాలు దక్కడం లేదన్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ వంటి పెద్ద సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా ‘బ్రాండ్ బాబు’ వంటి చిన్న బడ్జెట్ సినిమాలలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈషా ఇంకా తన కెరీర్ లో ఒక బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. తాజాగా ఈ భామ ఇప్పుడు కోలీవుడ్ లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది. జి.వి.ప్రకాష్ హీరోగా నటిస్తున్న ఒక తమిళ సినిమాతో తమిళ ప్రేక్షకులను ఈమె పలకరించబోతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది అని, ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయి పోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈషా కనిపించబోతోందట. ఏజ్హిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కాబోతోంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ ను త్వరలోనే చిత్రబృందం మొదలు పెట్టబోతోందని తెలుస్తోంది. మరోవైపు ఈమెకు తెలుగులో కూడా కొన్ని మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -