- Advertisement -
టాలీవుడ్ లో అశోకవనంలో అర్జున కల్యాణంతో తాజాగా డీసెంట్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించిందీ మూవీ. ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్. తర్వాత వైవిధ్యమైన పాత్రలతో అలరించాడు. ఇక లేటెస్ట్ హిట్ తో విశ్వక్ జోరు పెంచినట్లు తెలుస్తోంది.
రెమ్యూనరేషన్ పెంచేసి నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడు. ఇంతకు ముందు ఒక్కో సినిమాకు కోటిన్నర నుంచి 2 కోట్లు తీసుకునే వాడు. కానీ అర్జున కల్యాణంతో తర్వాత తన పారితోషకాన్ని మూడు కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది.
తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు ఇదే రేటు చెబుతున్నాడట దాంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో తగ్గబోనంటున్నాడీ యంగ్ హీరో.
సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!