Saturday, April 20, 2024
- Advertisement -

ప్రభాస్ ఆదిపురుష్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌లో భారీ‌ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. మంగళవారం సాయంత్రం అక్కడ మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. అయితే షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది.

మంటలను అదుపుచేయడానికి 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని చిత్ర యూనిట్‌కు చెందినవారు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

రెబల్‌ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’ మంగళవారం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘‘ఆది పురుష్’ ఆరంభ్’’ అంటూ టైటిల్ లోగోతో ట్వీట్ చేశారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
షూటింగ్‌ మొదలైన మొదటి రోజే ‘ఆదిపురుష్’ సెట్స్‌లో అగ్నిప్రమాదం జరగడంపై ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

దిష్టి పోయింది: మంచు మనోజ్
తొలిరోజే ‘ఆదిపురుష్’ సెట్స్‌లో అగ్నిప్రమాదం జరగడం పట్ల ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ, హీరో మంచు మనోజ్ అస్సలు బాధపడొద్దని అంటున్నారు. దిష్టి పోయిందని అనుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. ఎవ్వరూ గాయపడనందుకు దేవుడికి ధన్యవాదాలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -