పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘అజ్ఞాతవాసిస సినిమాకు మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ను మూటగట్టుకొంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలరావడంతో లబోదిబోమంటున్నారు. ఇప్పటికె నష్టాలలో ఉన్న సినిమాకు కాపీరైట్ వివాదం వదలడంలేదు. ఇప్పటికే ఫ్రెంచ్ సినమా లార్గోవించ్కు కాపీఅనేది తెలిసిన విషయం తెలిసిందే. గతంలోనే ఈసినిమాపై ‘లార్గోవించ్’ దర్శకుడు జరోమ్ సాలీ స్పందించారు.
అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే హక్కులు త్రివిక్రమ్ కుగానీ, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ కు గానీ, టీ-సిరీస్ కు గానీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. తన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసుకునే హక్కులు మాత్రమే టీ-సిరీస్ వద్ద ఉన్నాయన్నారు.
తాను ఈ చిత్రాన్ని చూశానని, ఆ సమయంలో థియేటర్ లో ఉన్న ఒకే ఒక్క ఫ్రెంచ్ వ్యక్తిని తానేనని, సినిమా కథతో సహా ఎన్నో సీన్లు, నటీనటుల నటన, లొకేషన్లు ఒకేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ సినిమా తీసిన నిర్మాతలతో భారత్ కు చెందిన టీ-సిరీస్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, వారికి తెలుగు రీమేక్ తో ఎటువంటి సంబంధమూ లేదని, హిందీ రీమేక్ కు మాత్రమే వారివద్ద అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. కోర్టుకు వెల్తేమాత్రం అజ్ణాత వాసికి చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై ఆ సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
In an exclusive interview over the #Agnyathavaasi plagiarism controversy, director @Jerome_Salle says that neither #Trivikram‘s @haarikahassine creations, nor @TSeries have the right to remake his #LargoWinch in Telugu. https://t.co/vMGBtDD15T @PawanKalyan
— Silverscreen.in (@silverscreenin) January 24, 2018