మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హిట్ మాత్రం రావట్లేదు.అతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి.ఈ సారి వచ్చే సినిమా ఎలాగైనా హిట్ కొట్టలనే కసితో వస్తున్నాడు.అందుకే లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సైట్ పేరుతో ఒక పోస్టర్ ను వదిలారు.
కలర్ .. బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసిన ఈ పోస్టర్ లో, గిటార్ తగిలించుకుని వెళుతోన్న సాయిధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు.ఇది సంగీత ప్రధానమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమాలో, తేజు సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.మరి ఈ సినిమా అయిన సాయి ధరమ్ తేజ్కు హిట్ ఇస్తుందేమో చూడాలి.