- రాజమౌళి, సుకుమార్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్
ఇద్దరు దర్శకులు కలిస్తే సినిమా ముచ్చట్లే ఉంటాయని అనుకుంటాం. సినిమా తప్ప వారికి వేరే ప్రపంచం ఉండదని భావిస్తుంటాం. కానీ అది కాకుండా వేరే వైపు ఇద్దరు దర్శకులు వెళ్లారు. తమ రంగం కాకున్నా క్రికెట్ వైపు మళ్లారు. ఇద్దరు దర్శకులు దాయాదులుగా మారి క్రికెట్ ఆడారు. అయితే ఈ క్రికెట్ ఆడిన వీడియోను కూడా టీజర్ మాదిరిగా విడుదల చేయడం ఆసక్తిగా మారింది.
బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలిపిన దర్శకుడు రాజమౌళి, తనదైన శైలిలో విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తున్న దర్శకుడు సుకుమార్. వీరిద్దరూ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా కొంచెం ఆటవిడుపుగా క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో విడుదలైంది.
రాజమౌళి, సుకుమార్ ఈమధ్య ఓ ప్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగిన రాజమౌళి, సుకుమార్ జట్ల మధ్య మ్యాచ్లు జరిగాయి. ఇద్దరు దర్శకులు తమ సినిమాల్లో నటిస్తున్న నటులతో పాటు టెక్నీషియన్స్ కూడా క్రికెట్ ఆడారు. నెట్ ప్రాక్టీస్ చేసి మరీ రంగంలోకి దిగారు. టాస్ వేయగా రాజమౌళి జట్టు బ్యాటింగ్ అవకాశం దక్కింది. మన జట్టు బ్యాటింగ్ చేయాలంటూ రాజమౌళి అందరికీ చెప్పడం వరకు టీజర్లో ఉంది. ఈ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది.
అయితే క్రికెట్ ఎవరెవరు ఆడారు? ఎంత లక్ష్యం? చివరికి ఏ జట్టు గెలిచిందో తెలియలేదు. దీనికి సంబంధించి మరో వీడియో విడుదల చేస్తారంట. ప్రస్తుతం సుకుమార్ రామ్చరణ్ హీరోగా రంగస్థలం సినిమా తీస్తున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్, రామ్చరణ్తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.