బిగ్బాస్ రెండో సీజన్ చివరి అంకానికి చేరుకుంది.రేపు(ఆదివారం) బిగ్బాస్ విన్నర్ ఎవరో తెలిపోనుంది.16 మంది కంటెస్టెంట్లతో మొదలైంది బిగ్బాస్ రెండో సీజన్.బిగ్బాస్ రెండో సీజన్ మొదటి నుంచి వివాదాలతోనే నడించిందని చెప్పాలి.రెండో సీజన్ మొత్తం ఒక్కరి చూట్టునే తిరిగింది.ఆ వ్యక్తి మరెవ్వరో కాదు కౌశల్.బిగ్బాస్ రెండో సీజన్ మొత్తం కౌశల్ హవనే నడించింది.అతనే విన్నర్ అవుతారని చాలామంది భావిస్తున్నారు.సోషల్ మీడియాలో కౌశల్కు భారీ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే.బిగ్బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనే విషయానికి వస్తే ముఖ్యంగా వినిపించే పేర్లు రెండు,ఒకటి కౌశల్,రెండు గీతా మాధురి.
వీరిద్దరిలో ఎవరో ఒకరు బిగ్బాస్ విన్నర్ అవుతారని చాలామంది నమ్ముతున్నారు.ఎక్కువ శాతం మాత్రం కౌశల్ విన్నర్గా నిలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాని మనకు అందుతున్న సమాచారం ప్రకారం బిగ్బాస్ విన్నర్గా గీతా మాధురి విజయం సాధించిందని తెలుస్తుంది.బిగ్బాస్ సీజన్ మొత్తం ఆకట్టుకున్న గీతాను విన్నర్గా ఎంపిక చేశారని సమాచారం.బిగ్బాస్ కంటెస్టెంట్లకి ఓట్లు వస్తే సరిపోదని,బిగ్బాస్ ఇంట్లో తమ ప్రవర్తన,గేమ్,టాస్క్,పనులు చూసి విన్నర్ని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.ఈ విషయంలో వెనకపడ్డ కౌశల్,బిగ్బాస్ విన్నర్ కాలేకపోయాడని తెలుస్తుంది.కౌశల్ ఇంటి సభ్యులందరితోను గొడవలు పెట్టుకున్నాడు.కౌశల్ ఎవరితోనే స్నేహం చేయలేదు .ఇక ఇంటి పనుల విషయానికి వస్తే పెద్దగా కుకింగ్ రూంలో కనిపించలేదు.ఎప్పుడు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడ్డాడు కౌశల్. ఈ కారణల చేతనే కౌశల్ బిగ్బాస్ విన్నర్ కాలేకపోయాడని సమాచారం అందుతుంది.
ఇక గీతా విషయానికి వస్తే రెండో సీజన్లో మొదటి కంటెస్టెంట్గా బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన గీతా మాధురి,షో అద్యాంతం ఆకట్టుకుందనే చెప్పాలి.షో చివరికి వచ్చే సరికి కాస్తా నెగిటివ్ ఆమెపై- వచ్చినప్పటికి వాటిని తట్టుకుని నిలబడింది.తప్పో,ఒప్పో తన మాట మీద నిలబడి అందరికి ఆదర్శంగా నిలిచింది గీతా.హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయిన వారికి వెన్నంటే ఉంటు ధైర్యం చెబుతుండేది గీతా.వీటిన్నింటిని పరిగణలోకి తీసుకుని గీతా మాధురిని విన్నర్గా సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.ఓట్ల విషయానికి వస్తే మాత్రం కౌశల్కే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం.మరి గీతా మాధురి బిగ్బాస్ విన్నర్ అయితే కనుక బయట ఉన్న కౌశల్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.