సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది.త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ఓవర్ సీస్ రిలీజ్ను భారీగా ప్లాన్ చేస్తున్నారు.ఓవర్సీస్లో తెలుగు హీరోలలో మహేష్ బాబు ఉన్న మార్కెట్ మరో హీరోకు లేదు.మహేష్ ఫ్లాప్ సినిమాలు కూడా అక్కడ మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాయి. దానిని బేస్ చేసుకుని భరత్ అనే నేను సినిమాను అక్కడ మరింత భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 2000 ప్రీమియర్ షోస్ వేయాలని భావిస్తున్నారు.
గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో ప్రీమియర్స్ షోస్ ను వేయలేదు. ఇప్పటికే విడుదల అయిన టీజర్,ఓత్,సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.శనివారం గ్రాండ్గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సినిమాకు కొరటాల శివ దర్శక్వతం వహిస్తున్నారు. హీరోయిన్గా కైరా అద్వానీ చేస్తుంది.