Sunday, April 28, 2024
- Advertisement -

గుంటూరు కారం @ నెంబర్ 1

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతన్న చిత్రం గుంటూరు కారం. జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా గుంటూరు కారం ట్రైలర్‌తో అదరగొట్టారు మహేష్ బాబు. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్ ఒక ఎత్తైతే ట్రైలర్ మరొక ఎత్తు.

మహేష్ ఫ్యాన్స్‌కి పండగనిచ్చేలా ట్రైలర్‌ని తెరకెక్కించారు. అందుకే విడుదల చేసిన 24 గంటల్లోనే 39 మిలియన్స్ వ్యూస్ సాధించి అత్యధిక వ్యూస్ సాధించి…ట్టమొదటి సౌత్ ఇండియన్ ట్రైలర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే 40 మిలియన్స్ దాటిపోగా ఇందుకు సంబంధించిన విషయాన్ని అభిమానులో పంచుకున్నారు మేకర్స్‌.

సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని UA సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 39 నిముషాలు నిడివితో రన్‌ టైం లాక్ చేశారు. జనవరి 9న గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఈ ప్రీ రిలీజ్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇలా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. మొత్తంగా గుంటూరు కారంతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు మహేష్ బాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -