ఈ ఏడాది సంక్రాంతి రేసులో వచ్చిన చిత్రం హనుమాన్. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కింది. ఈ సినిమా లాభాల నుండి వచ్చిన కొంత డబ్బును అయోధ్య రామాలయానికి విరాళంగా ప్రకటించారు. ఇక జనవరి 12న వచ్చిన ఈ చిత్రం ఇంకా విజయవంతంగా ప్రదర్శింప బడుతోంది.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూల్ చేయగా ఇప్పటికే సీక్వెల్ జై హనుమాన్ కూడా మొదలు పెట్టారు. సినిమా వచ్చిన 30 రోజుల్లో ఏకంగా 300 సెంటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
వాస్తవానికి ఒక చిన్న సినిమా 30 రోజుల పాటు 300 సెంటర్లలో ఆడటం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుత కాలంలో అగ్రహీరోల సినిమాలే ఈ ఫీట్ని అందుకోవడం లేదు. అలాంటిది ఒక చిన్న సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుండటం గొప్ప విషయమనే చెప్పాలి.