ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టగా ఈ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ వస్తున్న సంగతి తెలిసిందే. 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
హనుమంతుడు రాముడుకి ప్రమాణం చేస్తున్న ఫోటోని షేర్ చేసిన ప్రశాంత్ వర్మ…జై హనుమాన్తో అందరిని ఆకట్టుకుంటాను, మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపిస్తాను అంటూ ప్రామిస్ చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.
ఇక హనుమాన్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకురాగా పాజిటివ్ టాక్తో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సీక్వెల్ లో ఆంజనేయ స్వామి సూపర్ హీరోగా కనిపించబోతున్నారు.