సందీప్ కిషన్ .ఇతను రావడం రావడమే …నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ తో పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు.
ఆతరువాత తన మామ పేరు చెపుకుని హీరోగా సెటిలయ్యాడు. రెండు మూడు హిట్లు కొట్టాడనుకోండి.అయినా అతనికి నెగిటివ్ రోల్ చేస్తే వచ్చిన గుర్తింపు హీరో రోల్ చేస్తే రాలేదు.
అందుకే కాబోలు తనకు లైఫ్ నిచ్చిన విలన్ రోల్ ను మళ్లీ వేయాలని చూస్తున్నాడు.దానిలో భాగంగా చెర్రీ,సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తయారైన తని ఒరువన్ చిత్రంలో అరవింద్ స్వామి చేసిన విలన్ పాత్రను సందీప్ కిషన్ వేయబోతున్నాడని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మెగా కాంపౌండ్ తో గత కొన్ని రోజులుగా రాసుకు పూసుకు తిరుగుతున్న సందీప్ కు ఈవేషం రావడంతో పరిశ్రమ పెద్దగా ఆశ్చర్య పోవడం లేదు. ఎందుకంటే….మెగా హీరోలతో సందీప్ మూమెంట్స్ ను గత కొంతకాలంగా పరిశీలిస్తోన్న వారు …వీడేదో పెద్ద స్కెచ్చే వేస్తాడని అంచనా వేశారు.ఇపుడది నిజమైంది.