Thursday, May 16, 2024
- Advertisement -

అల్లు అర్జున్ తో ఆది ఢీ

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘సరైనోడు(వర్కింగ్ టైటిల్)’ ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు ఈ సినిమాని మాస్ మసాలా మూవీ గా తీస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో ఆది పినిశెట్టి  విలన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, ఆది పినిశెట్టిలపై సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు. అల్లు అర్జున్ కి జోడిగా హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు నటిస్తున్నారు. హీరోయిన్స్ కూడా త్వరలోనే షుటింగ్ లో జాయిన్ కానున్నారు.

ఈ సినిమాని సమ్మర్ కానికగా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాని నిర్మిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -