Wednesday, April 24, 2024
- Advertisement -

శేఖర్ కమ్ములతో సినిమాపై స్పందించిన ధనుష్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సిటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల ఎంతో విభిన్నమైన కథలతో సినిమాలను తెరకెక్కించారు. శేఖర్ కమ్ముల సినిమా అంటే అది పక్కా హిట్ అని నమ్మవచ్చు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అన్ని సినిమాలు ఎంతో విజయవంతమయ్యాయి. తాజాగా శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు అని ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై హీరో ధనుష్ స్పందించారు. మొట్టమొదటిసారిగా తెలుగులో నటించే చిత్రం శేఖర్ కమ్ముల గారితో కలిసి చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి పని చేయడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.నేను ఆరాధించే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు.నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లతో చేతులు కలపడానికి కూడా సంతోషిస్తున్నాను.

Also read:నాన్నకు ఆ విషయం ఇంకా తెలీదు.. నిహారిక షాకింగ్ వీడియో!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో  వి.ఎస్.వి.సి.ఎల్.ఎల్.పి. బ్యానర్ పై తెరకెక్కనున్న త్రిభాషా చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు ధనుష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also read:జవాన్స్ తో డ్యాన్స్ వేసిన అక్షయ్ కుమార్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -