Thursday, April 25, 2024
- Advertisement -

జవాన్స్ తో డ్యాన్స్ వేసిన అక్షయ్ కుమార్..?

- Advertisement -

రాత్రింబవళ్ళు ఎంతో కఠినమైన వాతావరణంలో దేశ రక్షణ కోసం పని చేస్తున్నటువంటి జవాన్ల సేవలు గురించి ఎంత చెప్పినా తక్కువే. మన దేశానికి నిజమైన హీరోలైన ఈ జవాన్లను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కలిశారు. కశ్మీర్‌లోని లోక్‌ గ్రామాన్ని సందర్శించిన అక్షయ్‌.. అక్కడి విధులు నిర్వహిస్తున్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) జవాన్లను కలిసి వారితో ఎంతో సంతోషంగా గడిపారు. ఈ విధంగా జవాన్లను కలిసిన ఫోటోలను అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also read:నా భర్త మాటల వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న: ప్రియమణి

ఈ విధంగా జవాన్లతో కలిసిన ఫోటోలను షేర్ చేసిన అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ..”నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు ఇది. దేశ సరిహద్దుల్లో మనల్ని రక్షిస్తున్న జవాన్లతో మరిచిపోలేని రోజును గడిపాను. దేశ సరిహద్దులోకి రావడం ఇక్కడ జవాన్లను కలుసుకోవడంతో నా మనసు జవాన్ల పట్ల ఎంతో గౌరవంతో నిండి పోయిందని” అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.

Also read:మరోసారి నగ్నంగా రెచ్చిపోయిన కియారా.. ఫోటోలు చూస్తే?

ఈ గ్రామానికి వెళ్లిన అక్షయ్ కుమార్ ముందుగా దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన అమర జవాన్ల స్మారక స్తూపం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడున్న జవాన్లతో ఎంతో సరదాగా మాట్లాడుతూ డ్యాన్సులు వేశారు. అలాగే జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడటమే కాకుండా ఓ జవాన్ తో కలిసి రెజ్లింగ్‌ కూడా చేశారు. అదేవిధంగా అక్కడ మారుమూల ప్రాంతమైన తులైల్‌ గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాఠశాల నిర్మాణం కోసం అక్షయ్ కుమార్ కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు.ఈ విధంగా ఈ పర్యటన గురించి తెలియజేస్తూ జవాన్లతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -