విభిన్నమైన కథలను ఎంపిక చేస్తూ తన కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్న కుర్ర హీరో నిఖిల్. కొత్త సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్లింగ్ చేస్తూ అతడు కూడా అభిమానులను సంపాదించకుంటున్నాడు. సూర్య వర్సెస్ సూర్య, స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావురా చిన్నవాడా వంటి సినిమాలు విజయవంతంతో ఉన్నాడు. ప్రస్తుతం కన్నడలో హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాను కిరాక్ పార్టీగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్నాడు.
దీంతో మరో సినిమాను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ హీరో మరో రీమేక్లో నటించబోతున్నాడని సమాచారం. తమిళ్లో కనితన్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. జనవరి 19 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తమిళ్లో దర్శకత్వం చేసిన సంతోశ్ తెలుగులో కూడా దర్శకత్వం చేయనున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా వివరాలను అధికారికంగా నిర్మాత ఠాగూర్ మధు ప్రకటిస్తారంట. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న కిరాక్ పార్టీ ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.