శ్రీదేవి మరణ వార్త విని యావత్ భారతదేశం మొత్తం షాక్ లోనైంది.ఈ సందర్బాంగా హీరో రాజశేఖర్ శ్రీదేవితో తనకున్న అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు.శ్రీదేవి మరణ వార్త విని షాక్ అయ్యానని శ్రీదేవి కుటుంబంతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ అడ్వొకేట్ అయితే, తన తండ్రి పోలీసు అధికారి కావడంతో వారిద్దరూ ఒకేచోట పని చేసేవారని, దీనికి తోడు దూరపు బంధుత్వం కూడా ఉండడంతో మంచి స్నేహితులుగా మారారని అన్నారు.
శ్రేదేవి తల్లికి తానంటే బాగా ఇష్టమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీదేవిని పెళ్లి చేసుకొమ్మని తనను కోరారని ఆయన అన్నారు. అయితే ఆమె సినిమాల్లో ఉందన్న కారణంతో వివాహాన్ని తిరస్కరించారని రాజశేఖర్ తెలిపారు. సినిమావాళ్లను పెళ్లి చేయడం ఇష్టం లేక తన కుటుంబ సభ్యులు శ్రీదేవితో పాటు ఆమె చెల్లి శ్రీలతతో కూడా వివాహానికి నిరాకరించారని రాజశేఖర్ వెల్లడించారు.