ప్రస్తుతం బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లోను బయోపిక్ల జోరు నడుస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ముఖ్యమంత్రుల బయోపిక్ సినిమాల రూపంలో వస్తున్నాయి.ఒకరు ఎన్టీఆర్ కాగ మరోకరు వైఎస్ఆర్. వైఎస్ఆర్ చిత్రానికి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం నటీనటుల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.వైఎస్ ఆర్ పాత్రకి మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకున్నరని సమాచారం.వైఎస్ఆర్ భార్య వైఎస్ విజయమ్మగా లేడి సూపర్ స్టార్ నయనతారని సెలక్ట్ చేసినట్టు సమాచారం. అలాగే ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను తమిళ హీరో సూర్య నటిస్తున్నడనే వార్త సంచలనంగా మారింది.
సినిమా వైఎస్ పాత్ర మమ్ముట్టి చేస్తుండగా ఆయన తనయుడు అయిన వైఎస్ జగన్ పాత్రను సూర్య చేస్తున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వైఎస్ జగన్, సూర్య ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు.పైగా వీరిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మొన్న ఆ మధ్య జగన్ పాదయాత్ర అప్పుడు ఆ పాదయాత్ర విజయవంతం కావలని సూర్య శుభాకాంక్షలు కూడా తెలిపాడు.వైఎస్ జగన్ పాత్రలో సూర్య ఒదిగిపొతాడు అని జగన్ అభిమానులు ఆశిస్తున్నారు.