Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రతి టికెట్‌పై ఒక్కో రూపాయి తెలుగు రైతులకు..

- Advertisement -

త‌మిళ హీరో విశాల్ మ‌రోసారి త‌న విశాల హృద‌యాన్ని చాటుకున్నాడు.విశాల్ తాజా చిత్రం అభిమన్యుడు త‌మిళ్‌తో పాటు తెలుగులో కూడా ఘ‌న‌విజ‌యం సాధించింది. అభిమన్యుడు చిత్రం ఇక్కడ సాధించిన వసూళ్లలో కొంత లాభాన్ని రైతులకు పంచాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి టికెట్‌పై ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తానని చెప్పాడు.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి వారంలో రూ.12 కోట్లు వసూలు చేసింది. ఇంత‌మంది తెలుగు హీరోలు ఉన్నా ఏ ఒక్క‌రు చేయ‌లేని ప‌నిని విశాల్ చేసి చూపించి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు.మా సినిమాలు అంత క‌లెక్ట్ చేసింది,రికార్డులు బ్రేక్ చేసింది అని చెప్పుకునే తెలుగు హీరోలు మ‌రి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -