హీరోయిన్ ప్రియమణి ముస్తఫా రాజాను అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆమె తల్లి కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రియమణి పెళ్లి తరువాత కూడా సినిమాలలో నటిస్తుంది.ఇక ఆమె సినిమాలతో పాటు పలు డాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు కొంతకాలం పాటు సినిమాలకు, టీవీ షోలకు బ్రేక్ తీసుకోవాలని భావిస్తోందట ప్రియమణి. దానికి కారణం ఆమె తల్లి కాబోతుందని అంటున్నారు.
తాజాగా ప్రియమణి సోషల్ మీడియా అకౌంట్ లో ‘త్వరలోనే మా నుండి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతుంది. వెయిట్ అండ్ వాచ్’ అంటూ తన భర్తతో తీసుకున్న ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఆమె తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రియమణి తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో నటించి తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.బాలీవుడ్లో షారుక్తో కలిసి ఓ ఐటెం సాంగ్లో కనిపించి మురిపించింది ప్రియమణి.