Saturday, May 11, 2024
- Advertisement -

ఆ కారణంగానే సినిమాలకు దూరమయ్యా… నటి సదా!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో 2002వ సంవత్సరంలో నితిన్, సదా హీరో హీరోయిన్లుగా నటించి సినిమా “జయం”. మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సదా ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినీ కెరియర్ మంచి ఊపు మీద ఉండగానే ఉన్నఫలంగా సినిమాలకు దూరమయ్యారు.

తాజాగా బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్న సదా ఈ విధంగా తన కెరీర్ అర్థాంతరంగా ఆగిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. తన అమ్మ సహకారంతోనే ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి అవకాశాలను దక్కించుకున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా జయం చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని సదా ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు.

సినీ జీవితం ఎంతో అద్భుతంగా ఉందనుకున్న సమయంలో తన తల్లికి క్యాన్సర్ అని తెలియడంతో ఒక్కసారిగా తన జీవితమే మారిపోయిందని, అమ్మ రిటైర్మెంట్ కి పది రోజుల ముందు తన పుట్టినరోజు. తన పుట్టిన రోజే తనకు క్యాన్సర్ ఉందని తెలియడంతో నేను నాన్న చాలా కృంగిపోయామని తెలిపారు. ఈ బాధ కారణంగానే తనకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి,ఏ నిర్మాణ సంస్థలలో అవకాశాలు వచ్చాయి అనేది కూడా ఆలోచించకుండా సినిమాలకు నో చెప్పేదానిని ఆ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యానని ఈ సందర్భంగా తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -