భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు సినీ నటులు ముందుకొచ్చారు.టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటులు ముందుకొచ్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పలువురు హీరోలు ఆర్థికసాయం ప్రకటించడమే కాకుండా , బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా తమ అభిమానులకు పిలుపునిచ్చారు.తెలుగు చిత్రపరిశ్రమ నుంచి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కేరళ సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించగా విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ఇచ్చారు. నిర్మాత బన్నీ వాసు ‘గీత గోవిందం’ సినిమా కేరళ వసూళ్లను సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు.
స్టార్ హీరోలు కమలహాసన్, సూర్య- కార్తి, విజయ్ సేతుపతి రూ. 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. సూర్య ప్రత్యేకంగా ‘అమ్మ’ ఫండ్కు రూ.10 లక్షల విరాళం అందించారు. హీరో సిద్ధార్థ్ రూ.10 లక్షల విరాళం ప్రకటించడమే కాకుండా విరాళాల సేకరణకు సోషల్ మీడియా చాలెంజ్ను ప్రారంభించాడు. ధనుష్ రూ.15 లక్షలు, విశాల్, శివకార్తికేయన్ రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించగా, సన్ టీవీ నెట్వర్క్ రూ. కోటి విరాళం ప్రకటించింది. మోహన్లాల్, మమ్ముట్టి రూ.25 లక్షల చొప్పున విరాళం అందించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రూ.50 లక్షలు అందజేసింది.