తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ తరహా క్రేజ్ సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో షూటింగ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ కారణంతో వకీల్ సాబ్ చిత్రం కూడా ఆలస్యం అయ్యింది.
ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలులో పవన్ ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో రైలెక్కి అభిమానులను ఆశ్చర్యపరిచారు పవన్. అమీర్పేట స్టేషన్ లో ట్రైన్ మారారు.
వన్ కళ్యాణ్ మెట్రో రైల్లో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ తో పాటుగా చిత్ర యూనిట్ కూడా మెట్రో రైల్లో ప్రయాణం చేసింది. కాగా, పవన్ కళ్యాణ్ మెట్రో రైల్లో ప్రయాణం చేసింనందుకు మెట్రో యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
నన్ను లైంగికంగా వత్తిడి చేశాడు.. అమీర్ ఖాన్ కూతురు
కాస్టింగ్ కౌచ్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్..!