Monday, May 6, 2024
- Advertisement -

16 ఏళ్ల వ‌యస్సులోనే నాపై అత్యాచారం జ‌రిగింది – యాంక‌ర్‌

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎక్క‌డ చూసిన ఈ కాస్టింగ్ గురించే చ‌ర్చ‌.అవ‌కాశాలు కోసం స్త్రీల‌ను లైంగికంగా వాడుకుంటున్నార‌ని ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట.ఇది సినిమా ఒక్క రంగానికే ప‌రిమితం కాలేదు.స్త్రీలు ప‌నిచేసే ప్ర‌తిచోట కాస్టింగ్ కౌచ్ ఉంద‌నేది స‌త్యం.ఇటీవ‌ల కాలంలో త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపులు స్త్రీలు భ‌యం లేకుండా బ‌య‌ట ప్ర‌పంచానికి చెబుతున్నారు.తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే ఒకటి బ‌య‌టికి వ‌చ్చింది.ప్రముఖ భారతీయ-అమెరికా టీవీ యాంకర్ పద్మాలక్ష్మి.. బాల్యం నుండి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

16 ఏళ్ల వయసులోనే ఆమెపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని వెల్లడించింది.నేను 16 ఏళ్ల వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడే 23 ఏళ్ల వ్య‌క్తితో డేటింగ్ చేశాన‌ని,అత‌నిని న‌మ్మి ఇంటికి వెళ్తే నాపై అత్య‌చారం చేసి త‌న లైంగిక వాంఛ తీర్చుకున్నాడ‌ని తెలిపింది పద్మాలక్ష్మి.కనీసం నాపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని మా అమ్మతో కూడా చెప్పుకోలేకపోయాను. స‌మాజంలో మగ‌వాడు త‌ప్పు చేసిన స్త్రీల‌నే నిందిస్తుంద‌ని,అది మారాల‌ని ,ప్ర‌తి ఒక్క‌రు స్త్రీల‌ను చూసే విధానంలో మార్పు రావ‌ల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపింది పద్మాలక్ష్మి చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -