టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ రాబోతుంది. సాధారణంగా బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ అగ్రహీరోల సినిమాల్లో చేసేందుకు ఇష్టపడతారు. కానీ తొలిసారి ఓ చిన్న హీరో సినిమాలో నటించేందుకు ముందుకొచ్చారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి.
అడవి శేష్ కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన సినిమాల్లో ఒకటి గుఢాచారి. బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ న్యూస్ వైరల్గా మారింది.
G2 మూవీలో ఇమ్రాన్ హష్మీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఆ పాత్ర సినిమాకే హైలైట్గా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఇనిమాతో పాటు ఇప్పటికే పవన్తో ఓజీ సినిమాలో నటిస్తున్నారు ఇమ్రాన్. పవన్కు విలన్గా నటిస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్లో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్కు మరిన్ని అవకాశాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.