- Advertisement -
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో సందడి చేశాడు. ఎప్పుడూ క్రికెట్ గ్రౌండ్లో బిజీగా ఉండే కోహ్లి కాస్త గ్యాప్ తీసుకొని షూటింగ్లకు కూడా హాజరవుతున్నాడు. తాజాగా ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్న కోహ్లిని టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కలిశాడు.
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఎల్లుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నిన్ననే హైదరాబాద్ చేరుకున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్కశర్మతో కలిసి ఇక్కడికి చేరుకున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.