Thursday, May 16, 2024
- Advertisement -

అవి వాడ‌తాను అయితే ఏంటీ – యాంక‌ర్ ర‌ష్మీ

- Advertisement -

బుల్లితెర హాట్ బ్యూటీ ర‌ష్మీ షాకింగ్ విష‌యాలు చెప్పింది.ప‌లు టీవీ షోల‌కి యాంక‌రింగ్ చేస్తు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చ‌కుంది ర‌ష్మీ.సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ర‌ష్మీ.త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను ఎప్ప‌టికప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.అభిమానుల‌తో కూడా ట‌చ్‌లోనే ఉంటుంది ర‌ష్మీ. తాజాగా ర‌ష్మీ త‌ను ఓ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాన‌ని తెలిపి అంద‌రికి షాక్ ఇచ్చింది.శిరీష అనే నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు ఫ్రెండ్లీగా స్పందించిన రష్మీ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 12 ఏళ్ల వయసు నుంచి దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో నొప్పి కలిగించే ఇంజెక్షన్లు తీసుకున్నాను.

అమ్మ చెప్పిన కొన్ని చిట్కాల వల్ల సమస్యను అధిగమించాను. నొప్పిని అనుభవించడం జీవితంలో భాగమే. అయితే శారీరక శ్రమతో వాటిని జయించాలి. తాజా ఆహారాన్ని తీసుకుంటూ, మంచి వాతావరణంలో ఉంటే మనల్ని ఏ విషయం దిగజార్చలేదంటూ’ రష్మీ వరుస ట్వీట్లు చేశారు. ‘మీ సమస్యను మళ్లీ గుర్తుచేసి మిమ్మల్ని అడిగి బాధ పెడుతున్నారు. మీరు ఇలాంటి విషయాలకు స్పందించకపోవడమే మంచిది. మీరు దృడంగా ఉండాలి. ఇలాంటి విషయాలకూ దూరంగా ఉండాలని కోరుతున్నానంటూ’ గిరిదర్ అనే నెటిజన్ రష్మీకి సూచించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -