Sunday, April 28, 2024
- Advertisement -

యాంక‌ర్‌ను వివాహ‌మాడిన ‘జ‌బ‌ర్ద‌స్త్’ క‌మెడియ‌న్‌

- Advertisement -

కృష్ణ‌న‌గ‌ర్‌లో తిరిగే వారంద‌రికీ ‘జ‌బ‌ర్ద‌స్త్’ ఓ నీడ‌లా.. క‌ల్ప‌వృక్షంలా మారింది. ఎంతోమంది ఆర్టిస్టుల‌కు మూడు పూట‌లా భోజ‌నం చేసేలా ‘జ‌బ‌ర్ద‌స్త్’ చేసింది. దీన్ని వేదిక‌గా చేసుకొని ఇప్పుడు ఎంతోమంది సినీ ప‌రిశ్ర‌మ‌లోకి, బుల్లితెర‌పైకి న‌టీన‌టులు వ‌చ్చారు. అందులో దొరబాబు ఒక‌డు. గ‌తంలో యూట్యూబ్‌లో ఏవేవో వీడియోలు చేస్తూ ఉండేవాడు. ఇత‌డి టాలెంట్‌ను గుర్తించి ‘జ‌బ‌ర్ద‌స్త్’లో అవ‌కాశం ఇచ్చారు.

హైప‌ర్ ఆది జ‌ట్టులో దొరబాబు కీల‌కంగా మారాడు. గోదావ‌రి యాస‌తో త‌న మీద హైప‌ర్ ఆది వేసే పంచ్‌ల‌తో స్కిట్‌ల‌ను హాస్యంగా పండిస్తున్నారు. ఆదితో దొర‌బాబు కూడా న‌ట‌న‌లో రాణిస్తున్నాడు. అయితే ఆదివారం (మార్చి 4) దొర‌బాబు యాంక‌ర్‌ను పెళ్లాడాడు. ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దొర‌బాబు యాంక‌ర్‌ను పెళ్లాడ‌డంపై ఆస‌క్తిక‌రం. ఇంత‌కు యాంక‌ర్ ఎవ‌రు..? ఎక్క‌డ పెళ్లి చేసుకున్నాడు అని ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

తూర్పు గోదావ‌రి జిల్లా తొండంగికి చెందిన పెదిరెడ్ల దొరబాబు నెల్లూరుకు చెందిన ఓ లోక‌ల్ టీవీ యాంకర్‌ నందిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి 8 గంటలకు సత్యగిరి కొండపై హరిహర సదన్‌ కాటేజీ పక్కన దొర‌బాబు కల్యాణం వేడుక‌గా జ‌రిగింది. ఈ వివాహానికి జబర్దస్త్ న‌టులు హైపర్‌ ఆది, రైజింగ్‌ రాజు, గణపతి, అప్పారావు, వినోదిని తదితరులు హాజరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -