Sunday, May 5, 2024
- Advertisement -

సౌత్ లో అడుగుపెట్టనున్న శ్రీదేవి కూతురు

- Advertisement -

ప్రముఖ సీనియర్ నటి శ్రీదేవి మరియు బోనీ కపూర్ ల ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ ‘దడక్’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. మరాఠీ లో సూపర్ హిట్ అయిన ‘సైరత్’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ అవడంతో జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈమె కార్గిల్ గాళ్, రుహీ అఫ్జా, తక్త్‌, గుంజన్ సక్సేనా బయోపిక్ వంటి బడా సినిమాలతో షూటింగులతో బిజీగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం జాన్వికపూర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జాన్వికపూర్ తండ్రి బోనీకపూర్ నిర్మాతగా హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలో అజిత్ హీరోగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో జాన్వీ కపూర్ ముఖ్యపాత్ర పోషిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా లో జాన్వీ కపూర్ కీలక పాత్ర పోషిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. మరి ఇప్పుడు అజిత్ సినిమా లో జాన్వీ కపూర్ నటిస్తుందా లేదా అనే విషయంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -