Thursday, May 2, 2024
- Advertisement -

కడుపుబ్బా నవ్విస్తున్న ‘జాతిరత్నాలు’

- Advertisement -

‘మహానటి’ చిత్రంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు నాగ్ అశ్విన్. అప్పటి వరకు టాలీవుడ్ లో సినీ నేపథ్యంలో బయోపిక్ లు రాలేదు. మహానటి చిత్రంతో అలనాటి సావిత్రమ్మ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిందీ అనేకన్నా జీవించింది అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ‘జాతిరత్నాలు’ అనే పదానికి కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్.

ఆయన నిర్మాణంలో అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శివరాత్రి కానుకగా జనం ముందుకు రాబోతోంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి పులికొండ,రాహూల్ రామకృష్ణ ఈ ముగ్గురు తమదైన కామెడీ పండిస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. స్వప్న సినిమా బ్యానర్ లో అనుదీప్ కేవీ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది.  ‘జాతిరత్నాలు’లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.

శుక్రవారం నుండి ‘ఉప్పెన’ విడుదలైన అన్ని థియేటర్లలోనూ ‘జాతిరత్నాలు’ టీజర్ ను ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. 65 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం వినోదాల విందు పంచుతూనే ఉంది.  శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ చేయబోతున్నాడు. మరి ఒకరికి ముగ్గురు కలిసి పంచే వినోదాల విందు ఎలా ఉంటుందో చూడాలి.

న్యూస్ పేపర్ డ్రెస్‌లో శ్రీముఖి అందాల హాట్ షో.. !

సింగరేణిలో చిరు ఆచార్య.. సినిమా లో కొత్త ట్విస్ట్..!

జగ్గూ బాయ్.. హ్యాపీ బర్త్ డే టూ యూ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -