Wednesday, May 1, 2024
- Advertisement -

శ్రీ దేవి కూతురు గ్లామర్ షో చేయబోతోందా?

- Advertisement -

ప్రియాంక చోప్రా, అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం ముఖ్య పాత్రలు పోషించిన ‘దోస్తానా’ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సీక్వల్ నిర్మించాలని ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర జాన్వి కపూర్ కి దక్కబోతోంది అని ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బోలెడు సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఇందులో ఒక హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తుండగా మరొక హీరోగా కొత్త యాక్టర్ ని పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ‘దోస్తానా’ సినిమాలో ప్రియాంక చోప్రా బికినీ వేసుకుని కుర్రకారు గుండెల్ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. మరిప్పుడు జాన్వి కపూర్ కూడా అదే చేయబోతోందా అని సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో లేక ఇంటర్నెట్ లో హాట్ హాట్ ఫోటోలతో కనువిందు చేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు ఏకంగా వెండితెరపైన బికినీలో దర్శనం ఇస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -