టాలీవుడ్ హీరోల దృష్టంతా ఇప్పుడు పాన్ ఇండియా మూవీపై ఉంది. ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు.. ఇలా ఈ లిస్టులో చాలా మంది యువ నటులు ఉన్నారు. తాజాగా అక్కనేని ఫ్యామిలీ హీరోస్ చూపు సైతం పాన్ ఇండియా సినిమాపై పడినట్లు తెలుస్తోంది. అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా వచ్చిన చివరి సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ క్లీన్ హిట్ను అందుకుంది. ప్రస్తుతం తాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
ఈ మూవీ కోసం అఖిల్ తన లుక్ను పూర్తిగా మార్చేశాడు. ఇంతకు ముందు ఎన్నడూ లేనంత స్టైలిష్గా కనిపించడంతో పాటు ఫిట్నెస్ విషయంలో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే ఏజెంట్ మూవీ నుండి విడుదలయిన ఫస్ట్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే త్వరలోనే అఖిల్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడన్న వార్త ఇటీవల వైరల్గా మారింది.
దీనికోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రంగంలోకి దిగనున్నాడు. బాలీవుడ్ దర్శకుడు, బాలీవుడ్ నిర్మాతతో తెరకెక్కే ప్రాజెక్ట్ అయినా కూడా దీనిని పాన్ ఇండియాలో లెవెల్లో తెరకెక్కించాలని మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోందట.