అతిలోక సుందరి శ్రీదేవి కుతురు ఇటీవలే ధడక్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు వరస ఆఫర్లు వస్తున్నాయి.కరణ్ జోహర్ నిర్మిస్తున్న సినిమాలో ఓ స్పెషల్ రోల్లో నటిస్తుంది జాన్వీ.అయితే తాజాగా జాన్వీ వేసుకున్న డ్రెస్ ద్వారా వార్తల్లో నిలిచింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల ముంబైలో ఇచ్చిన పార్టీకి హాజరైన జాన్వీ తన లుక్స్తో అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ పార్టీకి జాన్వీ ఎరుపు రంగు సిల్క్ క్రీప్ బటన్ అప్ షర్ట్, అదే కలర్ ట్రౌజర్స్తో హాజరై మెస్మరైజ్ చేశారు. రెడ్ డ్రెస్తో పాటు నలుపు రంగు బ్యాగ్, యాక్సెసరీస్తో స్టన్నింగ్ లుక్లో మెరిశారు. ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు వింటే షాక్ అవుతారు.జాన్వీ డ్రెస్ ఖరీదు భారతీయ కరెన్సీలో రూ లక్షా 1725 కావడం గమనార్హం.ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది జాన్వీ కపూర్.