Monday, April 29, 2024
- Advertisement -

NTR30లో తారక్ కి జోడీగా జాన్వీ కపూర్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏడాది క్రితమే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు పట్టాలెక్కలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై రకరకాల పుకార్లు షికారు చేశాయి. కథలో కొరటాల చాలా మార్పులు చేశాడని, కాదు కాదు.. పూర్తిగా కథనే మార్చి మరో కొత్త కథ సిద్దం చేస్తున్నాడని.. ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ రావడంతో తారక్ అభిమానులు ఊపిరి పిల్చుకున్నారు.

ఎన్నో రోజులుగా అభిమానులను ఉరిస్తున్న NTR30 ఫిబ్రవరి 24న రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం నందమూరి ఇంట విషాదం చోటుచేసుకోవడంతో వాయిదా వేశారు. ఈ మూవీకి సంబంధించి మెయిన్ కాస్టింగ్ ఫైనల్ అయింది. ఇక ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తారక్ కి జోడీగా కనిపించనుంది. మార్చ్ 6న జాన్వీ పుట్టిన రోజు నాడు ఆమెకు వెల్కమ్ చెప్పి ప్రకటించబోతున్నారు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన ఈ సినిమా వచ్చే నెల ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. యువ సుధా ఆర్ట్స్ బేనర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజర్. రత్నవేలు, సభు సిరీల్ లాంటి టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేయనున్నారు. కొరటాల ఎన్టీఆర్ కాంబోలో రెండో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -