సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలీ నటిస్తున్న చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే నెల విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆడియో ఆదివారం రాత్రి హైదరాబాద్లో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు రంజిత్ కబాలీ సినిమాకి సంబంధించిన స్టోరీని రివీల్ చేసేశారు. తాను ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన అట్టకత్తి, మద్రాస్ చిత్రాలను రజనీ గారు చూసి నాకు ఫోన్ చేశారని ఓ మంచి కథ ఉంటే చెప్పు మనం సినిమా చేద్దాం అని అన్నారు.
దాంతో తన దగ్గర ఉన్న కబాలీ కథ ను రజనీ గారికి వినిపించాను అది విని రజనీ గారు వెంటనే చాలా బాగుంది మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాడని తెలిపారు. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే బ్రిటిష్ కాలంలో మలేషియాకు వలసపోయిన కార్మికుల్లో ఓ కుటుంబంలో పుట్టిన వ్యక్తే కబాలీశ్వరుడు. కష్టాలు పడుతున్న కార్మికులను చూసి కబాలీశ్వరుడు ఏం చేసాడు అన్నది ఈ సినిమా.
మలేషియా బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఓ మాఫియా డాన్ కథ ఇది. ఇందులో రజనీకాంత రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపిప్తారు. అందులో ఒకటి యువకుడిగా, మరోకటి ‘ముల్లు మలార్’ సినిమా సమయంలో రజనీ స్టైల్ ఎలా ఉండేదో అలా ఉంటుందట. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు మంచి భావోద్వేగాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి.