Thursday, April 25, 2024
- Advertisement -

విరామ సమయంలో ఆ పనిలో బిజీగా గడుపుతున్న. కాజల్

- Advertisement -

అందాల చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించి టాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి అత్యధిక పారితోషికం పొందుతున్న నటిగా గుర్తింపు పొందింది. చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే తన బాల్య స్నేహితుడు వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని తన అభిమానులను నిరుత్సాహ పరిచింది.

ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో చాలామంది ఇంటికి పరిమితం అయ్యారు. ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుందని దాన్ని జయించటానికి కాజల్ అగర్వాల్ కొన్ని టిప్స్ చూపించింది.మనసుకు నచ్చిన పని చేస్తూ మానసిక ఒత్తిడిని జయించవచ్చని అంటోంది ఈ బ్యూటీ. అలాగే మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటూ సృజనాత్మకంగా అనుభూతి చెందడం ఈ సమయంలో చాలా అవసరమని చెబుతోంది. తాను ఇటీవల అల్లికలు నేర్చుకున్నానని, ఈ పని ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.మరి ఈ విరామ సమయంలో ఇంట్లో ఉండి మీరు ఏం చేస్తున్నారు అంటూ ఓ పోస్ట్‌ చేసింది హీరోయిన్ కాజల్.

Also read:బన్నీ కథలో ఎన్టీఆర్.. మరోసారి స్టూడెంట్ పాత్రలో!

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది ఈ బ్యూటీ.దీంతో పాటు తమిళంలో ‘గోష్టి’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ‘లైవ్ టెలికాస్ట్’ అనే హారర్ వెబ్‌సిరీస్‌లో కూడా నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Also read:అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -