మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు.ఇటీవలే చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ దేవ్ విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా కమర్షియల్గా విజయం సాదించకపోయినప్పటికి ,నటుడిగా కల్యాణ్ దేవ్కు మంచి మార్కులే పడ్డాయి.తాజాగా కల్యాణ్ దేవ్ రెండో సినిమాను లైన్లో పెట్టాడు.రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో పులివాసు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నరేష్, పోసాని కృష్ణమురలి వంటి సీనియర్ నటులు కనిపించనున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నాడు. సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ చేయలేదని త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ తెలియజేస్తామని నిర్మాత తెలిపారు.