Thursday, April 25, 2024
- Advertisement -

చిరంజీవి కోసం వాయిస్ అందిస్తున్న కోలీవుడ్ స్టార్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సైరా నరసింహ రెడ్డి. అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం స్టార్ టెక్నీషియన్ల ని మాత్రమే కాకుండా రామ్ చరణ్ స్టార్ నటి నటులను కూడా ఎంపిక చేసుకున్నాడు. అమితాబచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా వంటి పెద్ద స్టార్లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినిమాలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా పెద్ద నటులని రంగంలోకి దింపాడు రామ్ చరణ్.

తెలుగులో సినిమా కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వాయిస్ ని అందిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ లో పవన్ కళ్యాణ్ గొంతు అందరి దృష్టిని ఆకర్షించింది. మలయాళంలో మోహన్ లాల్ వాయిస్ అందిస్తుండగా తమిళంలో సినిమాకి లోకనాయకుడు కమల్ హాసన్ తన గొంతును ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వైపు సినిమాలు మరో వైపు బిగ్ బాస్ మరియు రాజకీయాలతో బిజీగా ఉన్న కమల్ హాసన్ చిరంజీవి కోసం సైరా తమిళ వెర్షన్ కి వాయిస్ ఇవ్వనున్నారు. కమల్ హాసన్ వల్ల ఈ సినిమాకి తమిళంలో కూడా మంచి హైప్ రాబోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -