బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా ‘మణికర్ణిక. ఈ సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతోంది. సినిమా ఎప్పుడో పూర్తి కావల్సి ఉన్న దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల మణికర్ణిక ఆలస్యం అవుతుంది.దీంతో ‘మణికర్ణిక’ సినిమా పూర్తి చేసే బాధ్యతలు కంగనా చేపట్టింది. దర్శకురాలిగా తానే కొన్ని సీన్స్ను తెరకెక్కిస్తుంది.మొన్నటి వరకు దర్శకుడి క్రిష్కు కంగనాకు మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.అయితే అలాంటిది ఏం లేదని సినిమా షూటింగ్ జరుగుతుందని ప్రకటించారు క్రిష్-కంగనా.తాజాగా కంగనా సోనూసూద్తో గొడవ పడిందని తెలుస్తుంది.
దీనిపై కంగనా మాట్లాడుతు… ”నాలాంటి మహిళా దర్శకురాలితో కలిసి పనిచేయడం సోనుకి ఇష్టం లేదు. అందుకే ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. నేను సోనుని తక్కువ చేసి చూశాననే వార్తల్లో నిజం లేదు. నేను ఇప్పటివరకు ఆయన్ను కలిసిందే లేదు. అలాంటప్పుడు ఆయన్ను తక్కువగా ఎలా చూస్తాను. అసలు విషయమేమిటంటే.. సినిమాలో ఆయన సీన్స్ ని ఆయనే రాసుకున్నారు. స్క్రిప్ట్ లో అయన రాసుకున్న సీన్స్ లేవు.సోను తెరకెక్కించిన సీన్స్ రచయితలకు నచ్చలేదు.దీంతో వాటిని సినిమా నుంచి తొలగిచారు.దీంతో సోనూసూద్ సినిమా నుంచి తప్పుకున్నారని చెప్పుకొచ్చింది కంగనా.
https://www.youtube.com/watch?v=tZSwSGef06M
https://www.youtube.com/watch?v=tZSwSGef06M