బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిన సంగతి మర్చిపోకముందే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా షాకిచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వివాదాలతోనే మార్మోగుతోంది. గత కొంతకాలంగా అమె సోషల్మీడియాలో పోస్ట్ లతో చర్చనీయాంశమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన అల్లర్లపై ట్విట్టర్లో మమత బెనర్జీని విమర్శిస్తూ ఆమె పోస్టులు చేయడంపై వివాదం చెలరేగింది.
దీంతో ట్విట్టర్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ కంగనా పోస్టులు పెట్టినందుకు.. ఆమె ట్విట్టర్ అకౌంట్ను శాశ్వతంగా నిషేధించింది. రెండు రోజుల క్రితం కంగనాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తాను యోగా చేస్తున్న ఫోటోని కూడా ఆమె జత చేసింది. కోవిడ్ అనేది ఒక చిన్న ఫ్లూ మాత్రమే అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఆమెపై విమర్శలు వచ్చాయి.
కరోనా ఫ్లూ లాంటి చిన్న రోగం. మీడియా ఎక్కువ ప్రచారం చేసి భయపెడుతోంది. ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందిపడుతూ మరణిస్తూంటే… చిన్న రోగం అనటం అభ్యంతరకమైన విషయం నెటిజన్లు విమర్శలు చేశారు. ఈమె పోస్ట్ చూసినవాళ్లు అందరు కరోనాను తేలికగా తీసుకుంటారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ప్రతీ రోజు దాదాపు 4 వేల మంది ప్రాణాలు బలిగొంటున్న కరోనా గురించి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినందుకు కంగనా చేసిన ఈ పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ తొలగించింది.