బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో లాక్అప్. 16 మంది వివాదాస్పద సెలబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో ఓ రేంజ్లో ఉంటుందని టాక్. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేలా ఉండే ఈ రియాల్టీ షోకు ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే, సుస్మితా సేన్ మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు బీ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ షో టీజర్ను విడుదల చేశారు.
ఈ టీజర్ను కంగన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ‘‘నా జైలు ఈ విధంగానే ఉంటుంది. గూండాయిజం, మీ నాన్న డబ్బులు ఇక్కడ పనిచేయవు’’ అని క్యాప్షన్ ఇచ్చింది. వీడియోలో కంటెస్టెంట్స్ అందరు ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించారు. మాములుగా అమెరికాలోని ఖైదీలు మాత్రమే ఈ కలర్ డ్రెస్ను ధరిస్తారు. టీజర్లో తన వ్యక్తిగత జీవితంలోని న్యాయ పోరాటలను, కాంట్రవర్సీలను గుర్తుచేసుకుంటూ ఇంట్రడక్షన్ ఇచ్చింది. ‘‘ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కొందరు నాలాగా ఉంటే, మరికొందరు మాత్రం బీ గ్రేడ్ స్ట్రగులర్స్. ఈ స్ట్రగులర్స్ ఎప్పుడు నన్ను తిట్టి వార్తల్లో ఉంటారు.
నెపోటిజం వంటి అంశాల మీద నా గొంతును నొక్కేయడానికి ప్రయత్నిస్తారు. నాకు వ్యతిరేకంగా వీళ్లు ఎఫ్ఐఆర్ను దాఖలు చేస్తారు. ఇప్పుడు నాకు సమయం వచ్చింది. నా జీవితం రియాలిటీ షోగా మారింది’’ అని కంగన చెప్పింది. ‘‘ఇది నా జైలు. నా రూల్స్ మాత్రమే ఉంటాయి. 16 మంది వివాదస్పద సెలెబ్రిటీలను నేను బంధించాను. నేను వారిని ఏం చేయాలనుకుంటే అది చేస్తాను. బాప్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్ను మీ ముందుకు తీసుకు వస్తున్నాను’’ అని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ పేర్కొంది. ఈ రియాలిటీ షో ట్రైలర్ను ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నారు. ఈ షో ఫిబ్రవరి 27నుంచి ఎఏల్టీ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్లో ప్రసారం కానుంది.
Also Read: షాకింగ్ కామెంట్స్ చేసిన ఎరికా ఫెర్నాండేజ్