టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు . దాదాపు 70 లక్షల మందికి పైనే మహేశ్ బాబు ట్విట్టర్ను ఫాలో అవుతుంటారు.తాజాగా ఆయన చూసిన ఓ ట్వీట్పై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. ఆయన తన అబిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై కన్నడ అభిమానులు పైరయ్యారు.
అన్ని భాషలకు సమానమైన ప్రాముఖ్యం ఇవ్వాలని, ఎక్కువ అభిమానులున్న కన్నడ భాషకు కూడా గౌరవం ఇవ్వాలని వారు మహేష్ బాబుకు సూచించారు. దాంతో పొరపాటును గుర్తించిన మహేష్ బాబు కన్న భాషను కూడా చేరుస్తూ మరోసారి ట్వీట్ చేశారు. మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహర్షి చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు.