- Advertisement -
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత భక్తవత్సలం ఆదివారం మృతి చెందారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే… ‘సంపూర్ణ రామాయణం’ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు భక్తవత్సలం. ఆ తరువాత పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎంపికయ్యారు.
కన్నడ సినిమాలకు ఆయన చేసిన సేవలకు గాను 2012లో డా.రాజ్ కుమార్ అవార్డు ను సొంతం చేసుకున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన బెంగుళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటలలో లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.