బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, హీరో సైఫ్ అలీఖాన్ కు ఐదేళ్ల కుమారుడు తైమూర్ ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల తర్వాత వారికి మరో కుమారుడు పుట్టాడు. తాజాగా కరీనా కపూర్ రెండో సారి కూడా మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కరీనా ఆదివారం ( ఫిబ్రవరి 21) పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు రిద్ధిమా కపూర్ తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
గత ఏడాది ఆగస్టు 12న కరీనా కపూర్ ట్వీట్ చేస్తూ తాను గర్భవతి అన్న విషయాన్ని తెలిపింది. 2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్లు పెళ్లి చేసుకోగా, 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించారు. చిన్నప్పటి నుండి తైమూర్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
త్వరలో ఈ చిన్నారి వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. కాగా, కరీనా కపూర్ ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తుంది.ఇక సైఫ్ అలీఖాన్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆది పురుష్’ సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు.
భగ్గుమన్న ఇరు వర్గాలు.. మధ్యలో పొలింగ్ ఏజెంట్ పై కన్నెర్ర..!